కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీపీఐ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ని కలిసిన సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ, కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పిన అంశాలని వివరించారు.
ఎన్నికలు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని సీఎం ఎలా ప్రకటన చేస్తారని ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరగా.. సీఈసీ సానుకూలంగా స్పందించిందని సీపీఐ నేతలు తెలిపారు.

గొల్కోండ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు
తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై గోల్కొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలు ఐదేళ్లు పరిపాలనసాగించాలని అధికారం ఇస్తే ఆయన 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆప్ కార్వాన్ నేత ఇర్ఫాన్ ఖాద్రి పీఎస్లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications