పరిహారం వద్దు, ఆ ఆభరణమే కావాలి: బ్యాంకు అధికారులకు తలనొప్పి
హైదరాబాద్: నాకు పరిహారం వద్దు.... నా బంగారు ఆభరణమే కావాలంటూ చాలా మంది మహిళలు పరిహారం డబ్బులు తీసుకునేందుకు నిరాకరిస్తుండడంతో ఏమి చేయాలో తోచక బ్యాంకు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆంధ్రాబ్యాంక్ చోరీ కేసులో ట్విస్ట్: యాజమాన్యంపై కేసు వివరాల్లోకి వెళితే గతవారం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో ఖాతాదారులకు చెందిన 4.6 కిలోల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు వారం రోజులు పాట రెక్కీ నిర్వహించి మరీ దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు (ఫోటోలు)ఈ నేపథ్యంలో దొంగతనం జరిగి విచారంతో ఉన్న బ్యాంకు అధికారులకు మహిళలు పరిహారం తీసుకునేందుకు నిరాకరిస్తుండడం కాస్తంత మనోవేదనకు గురి చేస్తోంది. దొంగతనానికి గురైన లాకర్లో ఎక్కువగా మహిళలకు సంబంధించిన ఆభరణాలున్నాయి.

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి
మహిళలు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేయడమే కాకుండా, నగలను అపురూపంగా చూసుకునే విషయం తెలిసిందే. దీంతో తమ నగలు చోరీకి గురయ్యాయని తెలియడంతో వారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. బ్యాంకు అధికారుల నుంచి పరిహారం తీసుకునేందుకు ససేమేరా అంటున్నారు.

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి
ఎంతో ఇష్టపడి చేయించుకున్న తమ నగలే కావాలని అధికారులకు చెబుతున్నారు. ఆంధ్రాబ్యాంక్ దొంగతనం ఘటనపై కొంతమంది మహిళలు తమ భార్యలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తానెంత చెప్పినా వినకుండా నగలను బ్యాంకులో తనఖా పెట్టారు. ఇప్పడు వాటిని చోరీ చేశారని వాపోతున్నారని తెలుస్తోంది.

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి
మరికొందరైతే తమ పుట్టింటి వారు పెట్టిన నగలు అని బ్యాంకు అధికారులతో గొడవకు సైతం దిగుతున్నారు. బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వలేమని చెప్పడంతో చేసేదేమీలేక చివరకు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పరిహారం వద్దు: బ్యాంకు అధికారులకు కొత్త తలనొప్పి
తమకు పరిహారం వద్దంటే వద్దు అంటూ తమకు సెంటిమెంట్గా ఉన్న అభరణాలే కావాలని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. త్వరలోనే దొంగలను పోలీసులు పట్టుకుంటారని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు నచ్చజెబుతున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications