చింత వలదు: కొడుకులే కూతుర్లవుతున్నారు
కొడుకులే ఉన్నారు కూతుర్లు లేరనే చింత అవసరం లేదంటున్నారు తెలంగాణ ప్రజలు.తెలంగాణలో బతకమ్మ పండుగకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు.ముఖ్యంగా ఆడబిడ్డలు ఎంతో వైభవంగా ఈ పండుగ చేసుకుంటారు.
కరీంనగర్: కొడుకులే ఉన్నారు కూతుర్లు లేరనే చింత అవసరం లేదంటున్నారు తెలంగాణ ప్రజలు.తెలంగాణలో బతకమ్మ పండుగకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు.ముఖ్యంగా ఆడబిడ్డలు ఎంతో వైభవంగా ఈ పండుగ చేసుకుంటారు.
చక్కగా అలంక రించుకొని సాంప్రదాయ దుస్తులను దరించి,తీరొక్క పువ్వులతో, నట్టింట కూర్చొని బతకమ్మ ను పేర్చి,అలా పేర్చిన బతకమ్మ ను ఆటకు తీసుకెల్తున్న ఆడ బిడ్డల్ని చూస్తూ తల్లి దండ్రులు ఎంతో ఆనందాన్ని పొందుతారు.ఈ సందర్భంగా ఆడ పిల్లలు లేని ఇల్లు బోసి పోయినట్లు ఉండేది.
కానీ కాలం మారింది.పండుగ చేసుకోవడానికి ఆడ, మగల తేడా ఎందుకని నేటి తల్లి దండ్రులనుకుంటున్నారు. అందుకే మగ పిల్లలు మాత్రమే ఉన్న ఇంటి లో వారి తోనే బతకమ్మను పేర్పించి ఆటకు తీసుకెల్తూ బతకమ్మ మీద తమకున్న భక్తి ని చాటుకుంటున్నారు.
English summary
On the occasion of Batukamma festival in Telangana daughters are giving pleasure parents.
Story first published: Wednesday, September 20, 2017, 11:14 [IST]