6 నెలల్లోనే కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు: నాలుగేళ్ల బాలికపై రేప్, హత్య, నేరస్తుడికి ఉరిశిక్ష
నాలుగేళ్ల చిన్నారి పైన లైంగిక దాడి చేసి, ఆ తర్వాత హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కరీంనగర్ ఫస్ట్ క్లాస్ అదనపు న్యాయస్థానం గురువారం నాడు సంచలన తీర్పు చెప్పింది.
కరీంనగర్: నాలుగేళ్ల చిన్నారి పైన లైంగిక దాడి చేసి, ఆ తర్వాత హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కరీంనగర్ ఫస్ట్ క్లాస్ అదనపు న్యాయస్థానం గురువారం నాడు సంచలన తీర్పు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ ఘటన జరిగింది.
నిందితుడు జక్కుల వెంకటస్వామి. అతను నాలుగేళ్ల చిన్నారి పైన అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చంపేశాడు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. మృతి చెందిన చిన్నారిది నిందితుడి గ్రామమే. కేసుకు సంబంధించి తగిన ఆధారాలు చూపించడంతో వెంకటస్వామికి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
కేవలం ఆరు నెలల వ్యవధిలో ఈ కేసుపై కోర్టు తీర్పు చెప్పడం గమనార్హం. నిందితుడిది కాటారం మండలం దామెరకుంటకు చెందిన వ్యక్తి. అతను చిన్నారి గొంతు కోసి గంప కింద దాచి పెట్టాడు. మహిళా సంఘాల పోరాటంతో అతనికి శిక్ష పడింది.
కాగా, జక్కుల వెంకట స్వామి భార్య గతంలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతను జులాయిగా తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఓ మహిళ పైన అత్యాచారయత్నం చేశాడు. అనంతరం ఈ చిన్నారి పైన ఘాతుకానికి పాల్పడ్డాడు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications