దానిని బ్లాక్ మనీ అనొద్దు, అలా అయితే మోడీకి మద్దతు: కేసీఆర్ కొత్త ప్రతిపాదన
హైదరాబాద్: సామాన్యుల వద్ద రూ.2.50 లక్షలకు పైగా డబ్బులు ఉంటే వాటిని బ్లాక్ మనీగా కాకుండా, లెక్కలోకి రాని నగదుగా పరిగణించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆయన గురువారం నాడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చిన పరిస్థితిని ప్రధానికి వివరించారు.
అధికారులతో భేటీ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించాల్సిన వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తాను తీసుకు వెళ్తానని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనకు పెద్ద నోట్ల రద్దు దోహదపడితే ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని కేసీఆర్ ఈ సమీక్షలో కేసీఆర్ అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.

రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం ఎల్లుండి ప్రధాని మోడీని కలవనున్నారు. రేపు ఢిల్లీకి చేరుకుని అందుబాటులో ఉండాలని ప్రధాని మోడీ సూచించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలపై కేసీఆర్.. మోడీతో చర్చిస్తారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications