ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారంనాడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో కలిసి కలెక్టరేట్కు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి టవర్ సర్కిల్ వరకూ భారీ రోడ్షో నిర్వహించారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని ఖావడం కాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక, పెద్దపల్లి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లిలో గడ్డం వెంకటస్వామి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నిజామాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నామినేషన్లో పాల్గొన్నారు. బీజేపీకి గుజరాత్లో ఒకస్థానం ఏకగ్రీవమైందని, ఇంకా 399 సీట్లే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పుష్కర్సింగ్ థామి పిలుపునిచ్చారు.
మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి ఖమ్మం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు సమక్షంలో భారీ రోడ్షో నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు.
JUST a Nomination Rally of BJP MP @bandisanjay_bjp at Karimnagar in #Telangana!
— BhikuMhatre (Modi's Family) (@MumbaichaDon) April 25, 2024
Can you imagine what's coming up, especially when BRS is facing existential crisis? pic.twitter.com/SKVFzzdP9h
మెదక్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ధ్యాన్ చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగియడంతో అధికారులు శుక్రవారం నుంచి వాటిని పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు ఏప్రిల్ 29 వరకు అవకాశం ఉంది. మే 13న కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నయి.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications