లోక్ సభ ఎన్నికల బరిలో ఈటల రాజేందర్.. అక్కడ రేవంత్ ను టెన్షన్ పెట్టే వ్యూహం!!
రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బిజెపి రెడీ అవుతుంది. బిజెపిలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీకి చెక్ పెడుతూ ఈసారి అభ్యర్థులను ముందే ఎంపిక చేసే పనిలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తారని భావించి పోటీ చేసిన పలువురు కీలక నాయకులు ఓటమిపాలు కావడంతో వారిని లోక్సభ ఎన్నికల బరిలోకి దించేందుకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంటుంది.
ఈ క్రమంలోనే గజ్వేల్, హుజురాబాద్ లలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన ఈటల రాజేందర్ కు బిజెపి లోక్సభ అభ్యర్థిగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. రానున్న లోక్ సభ ఎన్నికలలో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మల్కాజ్ గిరి టికెట్ ను బిజెపి ఈటల రాజేందర్ కు కేటాయించనున్న క్రమంలో ఈటల రాజేందర్ నేడు షామీర్ పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి పార్టీ కార్యకర్తలకు, తనకు సహకరించే నాయకులకు దీనికి సంబంధించిన వివరాలను తెలియజేయునట్టు సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్న బిజెపి టికెట్ కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి సీఎం పగ్గాలు చేపట్టారు. ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
రేవంత్ రెడ్డి వ్యూహాలను గీటుగా ఎదురుకోవడం కోసం బిజెపి బలమైన నాయకులను ఎన్నికల క్షేత్రంలోకి దించబోతోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలోకి దింపబోతున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది బీజేపీ.
సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుండి ఎం రఘునందన్ రావు, భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇక తాజాగా ఈటల రాజేందర్ కు మల్కాజ్గిరి నుంచి అవకాశం కల్పించనుంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications