ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమె ప్రాణం తీసింది: ఒకరితో వివాహేతర బంధం, మరొకరితో చనువు

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలు దాదాపు వివాహేతర సంబంధాలకు సంబంధించినవే కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఖమ్మంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తూ మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే కోపంతో ఆమెను హత్య ఓ దుర్మార్గుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్త మృతి

భర్త మృతి

తఘటనకు సంబంధించి వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకబండ బజార్‌కు చెందిన జగసాని రూప(42) భర్త శ్రీనివాస్ ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పట్నుంచి తన భర్త చేసిన బట్టల వ్యాపారాన్ని కొనసాగిస్తోంది రూప. గత కొంత కాలం క్రితమే తన కూతురికి కూడా వివాహం చేసింది.

నాలుగేళ్లుగా సహజీవనం..

నాలుగేళ్లుగా సహజీవనం..

కాగా, ముస్తాఫానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గయాజ్ పాషాతో రూపకు సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో వారిద్దరూ గత నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాఫానగర్‌లోని బరాకత్ చర్చి ప్రాంతంలో కొత్త ఇంటిని కట్టుకుంది రూప.

మరొకరితో చనువుగా..

మరొకరితో చనువుగా..

కాగా, ఇల్లు కట్టేందుకు వచ్చిన మేస్త్రీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో అతనితో చనువుగా ఉంటూ వచ్చింది రూప. అయితే, ఈ విషయం తెలిసిన గయాజ్ పాషా.. రూపను పలుమార్లు హెచ్చరించాడు. సదరు మేస్త్రీ ప్రసాద్‌ను కూడా మందలించాడు. ఈ నేపథ్యంలో తమ మధ్య కేవలం పరిచయం మాత్రమే ఉందని, ఇంకేమీ లేదని రూప.. పాషాకు తెలిపింది. అయినా, రూపతో తరచూ గొడవపడేవాడు పాషా.

ఆవేశంలో హతమార్చాడు..

ఆవేశంలో హతమార్చాడు..

ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. గురువారం తెల్లవారుజామువరకు గొడవపడిన పాషా.. ఆవేశంలో రూప మెడకు వైరు బిగించి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పాషాను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman killed in Khammam due to extramarital affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X