కన్న తండ్రే కాల యముడై.. కొడుకు, కూతురుకు మాజాలో విషం కలిపి !!
కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న తన ఇద్దరు పిల్లలను విషప్రయోగం చేసి, గొంతు నులిమి చంపేందుకు తండ్రి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం స్థానికులను షాక్కు గురి చేసింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల సమాచారం ప్రకారం..
మల్లేశం-పోచమ్మ దంపతుల అసలు స్వస్థలం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటరావుపేట. ఉద్యోగ సంబంధిత కారణాల వల్ల గత ఏడేళ్లుగా వీరు కరీంనగర్లోని వావిలాలపల్లిలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా అంత బాగోలేదని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు మల్లేశం తన కొడుకు ఆశ్రిత్, కూతురు అర్చనలకు మజా బాటిల్లో విష పదార్థాలు కలిపి ఇచ్చాడు. పిల్లలు విషపూరిత పానీయం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. వారి గొంతును నులిమి చంపేందుకు కూడా ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దారుణం అనంతరం మల్లేశం అక్కడి నుంచి పారిపోయాడు.

అయితే పని ముగించుకొని ఇంటికి చేరిన తల్లి పోచమ్మ పిల్లలను అపస్మారక స్థితిలో గమనించడం ఘటనను వెలుగులోకి తెచ్చింది. ఆమె స్థానికుల సహాయంతో ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా, కొడుకు ఆశ్రిత్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పిల్లలు పుట్టిననాటినుండే మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వారిని చూసుకోవడంలో వచ్చిన ఇబ్బందులు, పెరుగుతున్న ఖర్చులు, మానసిక ఒత్తిడి మల్లేశాన్ని ఈ ఘోర నిర్ణయం తీసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక ఇది ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేనని, ఇది పూర్తిగా హత్యాయత్నమేనని పోలీసులు స్పష్టం చేశారు. ఘటన తర్వాత పరారైన మల్లేశం కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. హత్య, హత్యాయత్నం, విషప్రయోగం వంటి పలు కీలక సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications