బాలానగర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో గల రంగారెడ్డి నగర్లో ఫ్యాన్ల కంపెనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలియవచ్చింది. మంటల ధాటికి భవనం మొత్తం కూలిపోయే స్థితిలో ఉంది. ఈ ప్యాక్టరీలో ఫ్యాన్ల విడిభాగాలు తయారు చేస్తారు.
ఈ సమయంలో ఏడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. మూడో అంతస్తు వరకు మంటలు అంటుకున్నాయి. ఈ సమయంలో లోపల ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. పై అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది.

ఐదు అగ్నిమాపక శకటాలు కృషి చేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై రోడ్లమీదకు పరుగుతీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఆవాస ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఉండకూడదని స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నివాసితుల ప్రాంతంలో ఫ్యాక్టరీలు లేకుండా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని, సుమారు 5 గంటలపాటు మంటలు ఎగిసిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications