పంథా మారిందా?: కెసిఆర్ ప్రభుత్వంపై గద్దర్ ప్రశంసలు
సంగారెడ్డి: వరంగల్ లోకసభ ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ను నిలబెట్టాలని తెలంగాణ వామపక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరంగల్ లోకసభ సీటుకు తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వ పథకాలను ఆయన మెచ్చుకున్నారు.
రాష్ర్టాభివృద్ధికి ప్రభుత్వం చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన కొనియాడారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, చెరువు, కుంటల పునరుద్ధరణ వంటి ఎన్నో చక్కటి ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు.

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఆదుకోవడానికి ప్రభుత్వ ప్రకటించిన రూ.6 లక్షల ఎక్స్గ్రేషియాను స్వాగతిస్తున్నానని అన్నారు. గతంలో మృతిచెందిన రైతులకు కూడా ఇది వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వరంగల్ ఎన్కౌంటర్పై ప్రభుత్వం కూడా చర్చిస్తుందని చెబుతూ దీనిపై పూర్తిస్థాయిలో విచారించి, భవిషత్లో ఇటువంటివి జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్ ఎంపీ ఉపఎన్నికల్లో ప్రస్తుతానికి తాను పోటీ చేయనని, భవిషత్ను ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
కెసిఆర్ ప్రభుత్వ పథకాలపై చేసిన వ్యాఖ్యలను, ఇద్దరు మావోయిస్టుల ఎన్కౌంటర్పై మాట్లాడిన తీరును చూస్తుంటే గద్దర్ పంథా మారినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications