గులాబీ నేతకు కాషాయ కండువా: ఒక్కో సీట్ లో లక్ష ఓట్లు గ్యారెంటీ
Guvvala Balaraju: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. భారతీయ జనతా పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. అనంతరం ప్రాథమిక సభ్యత్వాన్ని అందుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో చేరారాయన. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2023 ఎన్నికల సమయంలోనూ ఆయనకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ కు చెందిన చిక్కుడు వంశీ కృష్ణ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. దాదాపుగా 50 వేల ఓట్ల తేడాతో గువ్వల బాలరాజును మట్టికరిపించారు వంశీ కృష్ణ.
దీని తరువాత బీఆర్ఎస్ లో ఆయన పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లా స్థాయిలో నాయకులతోనూ పెద్దగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పైనా తరచూ విమర్శలు గుప్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీనితో గువ్వల బాలరాజు.. బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతాడనే ప్రచారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా వినిపించింది. దీనికి అనుగుణంగా ఆయన ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తాజాగా రామచందర్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీల సందర్భంగా ఈ రెండు పార్టీలు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి లక్ష ఓట్లు పడతాయని ధీమా వ్యక్తం చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications