తెలంగాణా కాంగ్రెస్ లో చిగురించిన చేరికల ఆశలు; రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా వారిపైనే!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలు పెడుతుంది. బీఆర్ఎస్, బిజెపిలో ఉన్న అసంతృప్త నేతలను, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించి, పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను వెనుకకు ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు బీజేపీలో ఇబ్బంది పడుతున్న నేత ఈటల రాజేందర్ ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు.

రేవంత్ రెడ్డి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయిన నేతలను, ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను కాంగ్రెస్ పార్టీ బాట పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లను కూడా హస్తం పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాహుల గాంధీ వారితో మాట్లాడగా, త్వరలో వారు కాంగ్రెస్ తీర్ధం తీసుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది.
తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం లేదని సాక్షాత్తు బిజెపి నేత ఈటల రాజేందర్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయ్యింది.ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రాగలిగితే, ఆపై చేరికలు జోరుగా కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
దీంతో ఈ నెలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. ఒకవేళ ఇది గనుక సక్సెస్ అయితే, కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు కొనసాగుతాయని కాంగ్రెస్ అధినాయకత్వం అంచనా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఘర్ వాపసీ తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.
-
డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications