మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క.. మార్చరీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక అత్యంత అమానవీయ ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ప్రాణంతో ఉన్నప్పుడు ఆదరణ కరువైనా, కనీసం మరణించాక మృతదేహానికి దక్కాల్సిన గౌరవం కూడా దక్కకపోవడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. బ్రతికున్న మనుషులపై కుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ఆ కుక్కలు చనిపోయిన మనిషిని కూడా వదలకపోతే..?
జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్(32) వృత్తిరీత్యా లారీ డ్రైవర్. శనివారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన, తిరిగి రాలేదు. డ్యూటీకి వెళ్ళాడేమో అని భావించిన కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. స్థానిక చెరువులో భీమేశ్వర్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల మార్చురీకి తరలించారు.

ఘోరం.. మార్చురీలో కుక్కల వీరంగం!
మార్చురీలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో భీమేశ్వర్ మృతదేహాన్ని నేలపైనే ఉంచారు. ఆ గదికి కనీసం తలుపులు సరిగ్గా లేకపోవడంతో ఒక కుక్క లోపలికి చొరబడింది. ఎవరూ లేని సమయంలో ఆ మృతదేహాన్ని కుక్క పీక్కుతింటూ కనిపించిన దృశ్యం చూసిన వారి ఒళ్లు గగుర్పాటుకు లోనయ్యారు. ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది.
పేరుకే అప్గ్రేడ్.. సౌకర్యాలు శూన్యం!
నిజానికి, 2023లో జడ్చర్లలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్ గ్రేడ్ చేశారు. కానీ, కొత్త భవనంలో మార్చురీకి సంబంధించిన ఫ్రీజర్లు గానీ, ఇతర వసతులు గానీ కల్పించలేదు. దీంతో గత్యంతరం లేక పాత ఆసుపత్రిలోని శిథిలమైన మార్చురీలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అక్కడ భద్రత లేక మృతదేహాలను అంబులెన్సుల్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆసుపత్రి వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంగళవారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ జడ్చర్ల ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను.. సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునీషా, ఎంఎన్ఓ రవిప్రకాష్ ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications