శాసనసభలో ఆ బిల్లుపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకేమాట
తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభ 2025 తెలంగాణా మానవ అవయవాల మార్పిడి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అవయవ మార్పిడి విషయంలో కొత్త చట్టాన్ని అమలుచేయటానికి ప్రభుత్వం నిబద్ధతతో కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు.
శాసనసభలో మానవ అవయవాల మార్పిడి బిల్లు
అంతకు ముందు, అవయవ దానానికి సంబంధించి గతంలో ఉన్న విధానాన్ని సవరిస్తూ, 2025 తెలంగాణా మానవ అవయవాల మార్పిడి బిల్లును శాసనసభ చర్చకు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాసన సభలో ప్రవేశ పెట్టిన బిల్లును అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం BRS బిల్లును సమర్ధించాయి. బిల్లును ప్రవేశపెడుతూ, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేసేందుకు ప్రతిపాదిస్తునట్లు చెప్పారు.

అవయవాల మార్పిడి బిల్లుకు బీఆర్ఎస్ ఆమోదం
చట్టంలో వచ్చిన మార్పులను తెలంగాణా రాష్ట్రం కూడా అమలుచేసి, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. బ్రెయిన్ డెడ్ ను ప్రకటించేందుకు మరింతమంది నిపుణులైన వైద్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లుపై BRS సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ, బిల్లును సమర్ధిస్తున్నట్లు చెప్పారు. అలాగే, అవయవదానం చేసినా సందర్భంలో వారికి ప్రభుత్వం తరఫున అధికారికంగా అంత్యక్రియలు చేయాలనీ, వారి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూర్చాలనీ సూచించారు.
శాసన సభ్యులంతా అవయవ దానం చెయ్యాలన్న కేటీఆర్
అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారి జాబితా సుదీర్ఘంగా ఉందనీ, ఇప్పటికే రాష్ట్రంలో అవయవ దానం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాసన సభ్యులంతా అవయవ దానం చేసి తమ నియోజక వర్గాల ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, అందుకు వీలుగా తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ణ తీసుకోవాలని BRS సభ్యులు K తారక రామారావు సూచించారు.
అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చెయ్యాలన్న కేటీఆర్
ఇందుకు అవసరమైన ఒక అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని శాసన సభ స్పీకరు గడ్డం ప్రసాద కుమార్ కు సూచించారు. ఈ విషయమై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. మనమంతా ప్రజా ప్రతినిధులమని, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications