అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా మూడు పార్లమెంట్ స్థానాలకు 29 అసెంబ్లీ స్థానాలకు వివిధ కారణాలతో ఉపఎన్నికలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉపఎన్నికలను ప్రత్యర్థి పార్టీలు ఆయా ప్రభుత్వాలకు రిఫరెండంగా భావిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో బద్వేలు నియోజకవర్గం, తెలంగాణలో హుజూరాబాద్ నియోజక వర్గాలకు ఉపఎన్నిక జరిగింది. అయితే అందరి దృష్టి హుజూరాబాద్ ఉపఎన్నిక పైనే పడింది. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
హుజూరాబాద్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులు చేసేలా టీఆర్ఎస్ హుజూరాబాద్లో జెండా ఎగురవేస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బద్వేలులో వార్ వన్సైడ్ జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలే నిజమయ్యాయి. బద్వేలులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా బీజేపీ అభ్యర్థి పంతాల సురేష్ పై 90,590 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి కొంత సమయంలో హుజూరాబాద్ ఫలితం కూడా వెలువడనుంది. తెలుగు రాష్ట్రాల ఉపఎన్నిక ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నిక ఫలితాలు మినిట్ - టూ - మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.
Nov 02, 2021, 7:32 pm IST
హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు టీఆర్ఎస్ పాలన అంతానికి నాంది అని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.
Nov 02, 2021, 7:31 pm IST
ధర్మానికి, అధర్మానికి జరిగిన యుద్ధంలో ధర్నాన్నే ప్రజలు గెలుపించారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Nov 02, 2021, 7:26 pm IST
ఎన్నికల్లో స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. భవిష్యత్ పోరాటాలకు కార్యకర్తలు మరింత సన్నద్ధంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా మంంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Nov 02, 2021, 7:25 pm IST
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ 20 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందన్నారు.
Nov 02, 2021, 7:11 pm IST
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రజాతీర్పును గౌరవిస్తామన్నారు.
Nov 02, 2021, 6:43 pm IST
హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలుపొందడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.
Nov 02, 2021, 6:09 pm IST
హుజూరాబాద్
హుజూరాబాద్లో ఈటల రాజేందర్ విజయం. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 20వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించిన ఈటల
Nov 02, 2021, 4:06 pm IST
మేఘాలయా
మేఘాలయాలోని రాజబాల ఉపఎన్నికలో అధికార ఎన్పీపీ పార్టీ కైవసం చేసుకోగా ఈ పార్టీ మిత్రపక్షం యూడీపీ మాఫ్లాంగ్ సీటులో విజయం సాధించింది
The People have made their choice by ensuring victory for our candidates Sh. Abdus Saleh in Rajabala constituency & Sh. Pyniaid Sing Syiem in Mawryngkneng constituency. This is a victory of our people.
హుజూరాబాద్లో నాల్గవ రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీకి 4314 ఓట్లు
Nov 02, 2021, 11:18 am IST
హుజూరాబాద్
హుజురాబాద్లో నాల్గవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. నాల్గవ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2500 ఓట్లు ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు
Nov 02, 2021, 11:11 am IST
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఉపఎన్నిక. ఏపీలో వైసీపీ ముందంజ, 3 అసెంబ్లీ స్థానాల్లో తెలంగాణ బీజేపీ ముందంజ, అస్సాంలో 2 స్థానాల్లో యూపీపీఎల్ ముందంజ, బీహార్లో చెరో స్థానంలో ఆర్జేడీ జేడీయూ ముందంజ, హర్యానాలో ఐఎన్ఎల్డీ ముందంజ
By-election to Assembly constituencies across 14 states | YSRCP leading on the lone seat in Andhra Pradesh, BJP leading on 3 & UPPL on 2 in Assam, JD(U) & RJD on one each in Bihar and INLD leading on the single-seat in Haryana. pic.twitter.com/05AZkshsKa
ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించనున్న అధికారులు
10:49 PM, 1 Nov
కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
6:39 AM, 2 Nov
తెలంగాణ
ఇంకాస్సేపట్లో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆరంభం కానుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ఎవరికి వారే గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తోన్నాయి. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.
6:53 AM, 2 Nov
ఆంధ్రప్రదేశ్
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకాస్సేపట్లో మొదలు కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరుస్తారు. కిందటి నెల 30వ తేదీన ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.
7:11 AM, 2 Nov
ఢిల్లీ
దేశవ్యాప్తంగా మూడు లోక్సభ, 30 శాసన సభ స్థానాలకు కిందటి నెల 30వ తేదీన నిర్వహించిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొద్దిసేపట్లో మొదలు కానుంది.
7:36 AM, 2 Nov
ఢిల్లీ
ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ సహా దేశవ్యాప్తంగా మూడు లోక్సభ, 30 శాసన సభ స్థానాలకు కిందటి నెల 30వ తేదీన నిర్వహించిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొద్దిసేపట్లో మొదలు కానుంది. మధ్యాహ్నానికి వాటి ఫలితాలు స్పష్టం కానున్నాయి.
8:31 AM, 2 Nov
హుజూరాబాద్ బద్వేల్ నియోజకవర్గాల్లో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
8:32 AM, 2 Nov
హుజూరాబాద్
హుజూరాబాద్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వెనుకంజలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
8:38 AM, 2 Nov
బద్వేల్లో ప్రారంభమైన ఈవీఎం ఓట్ల లెక్కింపు
8:38 AM, 2 Nov
బద్వేల్
మొత్తం 11 రౌండ్లు ఓట్ల లెక్కింపు. ముందుగా కలసపాడు మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభం
8:41 AM, 2 Nov
హుజూరాబాద్
హుజూరాబాద్లో తెరుచుకున్న ఈవీఎంలు.ఓట్ల లెక్కింపు ప్రారంభం
8:42 AM, 2 Nov
హుజూరాబాద్
ఉదయం 9:30 గంటలకు తొలిఫలితం వచ్చే అవకాశం ఉంది
8:51 AM, 2 Nov
హుజూరాబాద్
పోస్టల బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొత్తం 723 ఓట్లు
టీఆర్ఎస్: 503
బీజేపీ : 159
కాంగ్రెస్ : 32
చెల్లనివి: 14
8:54 AM, 2 Nov
బద్వేల్
బద్వేల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ముందంజ
10:08 AM, 2 Nov
బద్వేల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ముందంజ. భారీ విజయం దిశగా దూసుకెళుతున్న డాక్టర్ సుధ
10:09 AM, 2 Nov
హుజూరాబాద్
రెండవ రౌండ్ ఓట్ల లెక్కింపు..
టిఆర్ఎస్ : 4947
బీజేపీ : 4769
బీజేపీ లీడ్ : 193.
10:10 AM, 2 Nov
హుజూరాబాద్
దళితబంధును మొదట ప్రకటించిన సాలపల్లి గ్రామంలో బిజేపి అధిక ఓట్లు పోలయ్యాయి
In few hours the counting will take place for the bypolls held for 3 parliament constituencies and 30 assembly constituencies.All eyes are on Huzurabad constituency from telangana