హైటెక్ వ్యభిచారం: సిద్ధార్థ్ గుట్టు చెప్పింది అతని ప్రేయసే
స్పా, మసాజ్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారాన్ని పోలీసులకు అందించింది ఓ మహిళ అని తెలుస్తోంది. ఆమె సిద్దార్థ్ మాజీ ప్రేయసి అని చెబుతున్నారు.
హైదరాబాద్: స్పా, మసాజ్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారాన్ని పోలీసులకు అందించింది ఓ మహిళ అని తెలుస్తోంది. ఆమె సిద్దార్థ్ మాజీ ప్రేయసి అని చెబుతున్నారు. దాసరి సిద్దార్థ్ ఆమెను ప్రేమించి, తర్వాత మోసం చేశాడని చెబుతున్నారు.
ఆమె పోలీసుల వద్దకు వెళ్లి సెక్స్ దందా గురించి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో పోలీసులు స్పా, మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించి వ్యభిచారం దందా గుట్టు విప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాపారం నిర్వహిస్తున్నవారిలో కీలక పాత్రధారిగా గుర్తించి దాసరి సిద్ధార్థ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నెలసరి వేతనంపై పనిచేస్తున్న థాయ్లాండ్కు చెందిన ఓ మహిళలకు పోలీసులు విముక్తి కలిగించారు. వారిని తొలుత మసాజ్ చేయడానికంటూ నియమించుకుని తర్వాత వ్యభిచారం రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది.
నెలకు రూ. 40 వేల దాకా....
స్పా, మసాజ్ సెంటర్లలో పనిచేస్తున్న మహిళల్లో కొందరు నెలకు దాదాపు రూ.40 వేల దాకా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. యజమాని ఇచ్చే వేతనం, విటులు సమర్పించే టిప్స్, కమిషన్ వంటి ఇతర రూపాల్లో కలిపి అంత వచ్చేదని అంటున్నారు.
విజిట్ వీసాపై వచ్చారు...
థాయ్లాండ్ మహిళలు విజిట్ వీసాపై హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి వయస్సు 22 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుంది. కెకె వారిని స్పా, మసాజ్ సెంటర్లలో నియమించినట్లు, ఆ తర్వాత వ్యభిచారంలోకి దింపినట్లు చెబుతున్నారు. మసాజ్ సర్వీసులకు రూ. 4 వేల చొప్పున, శృంగారానికి 8 వేల రూపాయల చొప్పున స్పా యజమానులు కస్టమర్ల నుంచి వసూలు చేసినట్లు చెబుతున్నారు.
ఆన్లైన్లో డబ్బులు....
నగదు రూపంలోనూ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు డబ్బులు చెల్లించేవారు. కొంత మంది ఆన్లైన్లో చెల్లింపులు జరిపేవారని సమాచారం. డబ్బులు 12 బ్యాంకులకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. కొంత మంది మహిళలకు సిద్దార్థ్ స్పాలోనే వసతి ఏర్పాటు చేశాడు.
అద్దెకు తీసుకున్నాడు....
సిద్ధార్థ్ మహిళల కోసం హైదరాబాదులోని బంజారాహిల్స్లో త్రీ బెడ్రూం ఫ్లాట్స్ అద్దెకు తీసుకున్నాడు. అతను నెలకు రూ. 2 లక్షలు అద్దె చెల్లించేవాడు. శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు ఆరు స్పాలపై దాడులు చేసి 65 మహిళలను, సిద్ధార్థ్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 34 మంది థాయ్లాండ్ మహిళలు కాగా 21 మంది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు.