చంద్రబాబు, రేవంత్రెడ్డికి శుభవార్త వినిపించిన నరేంద్రమోడీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారిని త్వరలోనే 12 లైన్లకు విస్తరించబోతున్నారు. ఈ రహదారి పొడవు మొత్తం 576 కిలోమీటర్లు కాగా తెలంగాణలో 210 కిలోమీటర్ల, ఏపీలో 260 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ రెండు మహానగరాల మధ్య ఈ రహదారిలో ప్రయాణించాలంటే తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మారనున్న రాయలసీమ ముఖచిత్రం
రెండూ అభివృద్ధి చెందిన నగరాలే కాబట్టి వీటిల్లో పలు ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కొలువుదీరాయి. హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రతి రోజు వేలసంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారిని విస్తరించంతోపాటు దీని వెంబడి ఎకానమీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి ప్రోత్సాహకాలు కూడా అందించబోతున్నారు.

ఈ రోడ్డు విస్తరణ వల్ల ప్రధానంగా రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ హైవే మన రాష్ట్రంలో కర్నూలు నుంచి ప్రారంభమై శ్రీసత్యసాయి జిల్లాలోని కొండికొండ వద్ద ముగుస్తుంది. కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, పెనుకొండ మీదుగా వెళుతుంది. ఈ రోడ్డువల్ల రాయలసీమ ముఖచిత్రమే మారిపోనుంది.
విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా
ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి అమరావతి మధ్య కొత్తగా ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని కోరగా కేంద్రం అంగీకారం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్-అమరావతి మధ్య 220 కిలోమీటర్ల దూరం ఉంది. కొత్త రహదారితో ఈ రెండు నగరాల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. విభజన హామీ చట్టంలోను దీని ప్రస్తావన ఉండటంతో అంగీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications