బీజేపీలో చేరడం లేదు: టీఆర్ఎస్ ఎంపీ పాటిల్
తాను భారతీయ జనతా పార్టీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: తాను భారతీయ జనతా పార్టీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ స్పష్టం చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బీబీ పాటిల్ తేల్చి చెప్పారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

నారాయణ్ఖేడ్లోని మెగాఫుడ్ పార్క్ భూముల విషయంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని బీబీ పాటిల్ తెలిపారు. భూముల కొనుగోలు చేసిన కంపెనీ తనకు చెందిన వారిదైనప్పటికీ.. రైతులకు అన్యాయం జరిగినట్లు తన వద్దకు వస్తే వారి పక్షాన నిలబడి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications