దిగిరాని జూడాలు: రాజయ్య అనుమానాలు(ఫోటోలు)
హైదరాబాద్: జూడాల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. బయటి వ్యక్తుల సహాకారంతో వారు సమ్మె చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ రాజయ్య అన్నారు. సచివాలయంలోని ఆయన చాంబర్లో ఆదివారం సాయంత్రం జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపాలని నిర్ణయించినా.. జూడాలు అక్కడికి వచ్చి చర్చల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. అనంతరం డిప్యూటీ సీఎం రాజయ్య మీడియా పాయింట్లో మాట్లాడుతూ వారం రోజుల క్రితం చర్చలకు పిలిచి.. వారు కోరిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు.
ఏడాది తప్పనిసరి ప్రభుత్వ సేవలు, ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవల విషయంలో ప్రభుత్వ విధానం కూడా రెగ్యులర్ అపాయింట్మెంట్ చేయాలన్నదేనని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్లో తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదని, అధికారుల నియామకం జరగలేదని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. రెండు రాష్ర్టాల్లో వైద్యులు, ఖాళీల పూర్తి వివరాలు తెలిశాక శాశ్వత నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు.

దిగిరాని జూడాలు: రాజయ్య అనుమానాలు
జూడాల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. బయటి వ్యక్తుల సహాకారంతో వారు సమ్మె చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ రాజయ్య అన్నారు. సచివాలయంలోని ఆయన చాంబర్లో ఆదివారం సాయంత్రం జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపాలని నిర్ణయించినా.. జూడాలు అక్కడికి వచ్చి చర్చల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు.

దిగిరాని జూడాలు: రాజయ్య అనుమానాలు
అనంతరం డిప్యూటీ సీఎం రాజయ్య మీడియా పాయింట్లో మాట్లాడుతూ వారం రోజుల క్రితం చర్చలకు పిలిచి.. వారు కోరిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు.

దిగిరాని జూడాలు: రాజయ్య అనుమానాలు
ఏడాది తప్పనిసరి ప్రభుత్వ సేవలు, ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవల విషయంలో ప్రభుత్వ విధానం కూడా రెగ్యులర్ అపాయింట్మెంట్ చేయాలన్నదేనని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్లో తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదని, అధికారుల నియామకం జరగలేదని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దిగిరాని జూడాలు: రాజయ్య అనుమానాలు
రెండు రాష్ర్టాల్లో వైద్యులు, ఖాళీల పూర్తి వివరాలు తెలిశాక శాశ్వత నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు.

హౌజ్ సర్జన్లు, పీజీ చేసేవారు ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఉంటేనే
తెలంగాణ కౌన్సిల్లో రిజిస్టర్ నంబరు వస్తుందని, అప్పుడే వారు బయట ప్రాక్టీసు చేసుకునేందుకు గుర్తింపు వస్తుందని తెలిపారు.

దిగిరాని జూడాలు: రాజయ్య అనుమానాలు
వైద్య విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరే ముందు ఏడాదిపాటు సేవలు అందిస్తామని బాండ్ పేపర్లపై సంతకాలు చేశారని అన్నారు. జూడాల గౌరవవేతనం పెంచేందుకు.. సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో సమానంగా వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు.

దిగిరాని జూడాలు: రాజయ్య అనుమానాలు
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడోరోజుకు చేరాయి. ఆదివారం శిబిరం వద్ద బైఠాయించి డీఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దిగిరాని జూడాలు: రాజయ్య అనుమానాలు
గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా సేవచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఐతే పర్మనెంట్ చేయాలని కోరారు. రాం సుబ్బారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, ప్రదీప్, గౌతమ్, హేమకుమార్, ప్రవీణ్ దీక్షలో కూర్చున్నారు.
హౌజ్ సర్జన్లు, పీజీ చేసేవారు ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఉంటేనే తెలంగాణ కౌన్సిల్లో రిజిస్టర్ నంబరు వస్తుందని, అప్పుడే వారు బయట ప్రాక్టీసు చేసుకునేందుకు గుర్తింపు వస్తుందని తెలిపారు. వైద్య విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరే ముందు ఏడాదిపాటు సేవలు అందిస్తామని బాండ్ పేపర్లపై సంతకాలు చేశారని అన్నారు. జూడాల గౌరవవేతనం పెంచేందుకు.. సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో సమానంగా వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు.
ప్రస్తుతం రూ.28-30వేలు వస్తుండగా.. రూ.40-45వేల వేతనం, ఇతర అలవెన్సులు రెగ్యులర్ ఎంప్లాయిస్ వలె ప్రతినెలా ఇస్తామని హామీ ఇచ్చారు. గాంధీలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు కల్పిస్తున్నామని.. ఏయే ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత ఇవ్వాలో హోంశాఖ ఇస్తే సరేనని.. లేదంటే రూ.7-8కోట్లు వెచ్చించి భద్రత కల్పిస్తామని తెలిపారు. అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని.. ప్రజల నుంచి డిమాండ్ ఉండటం వల్ల పీహెచ్సీల్లో 374 మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశామన్నారు.
డాక్టర్లు తెలంగాణలో ఉంటారో, ఏపీలకు పోతారో స్పష్టత వస్తుందని.. ప్రస్తుతం బ్యాన్ ఉందని, దీన్ని ఎత్తివేయాల్సి ఉందన్నారు. ఇన్ని పరిస్థితులు ఉండగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లమని చెప్పి సమ్మె చేయటం బాధాకరమని అన్నారు. ప్రభుత్వమంటే జూనియర్ డాక్టర్లకు గౌరవం లేదని అన్నారు.
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడోరోజుకు చేరాయి. ఆదివారం శిబిరం వద్ద బైఠాయించి డీఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా సేవచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఐతే పర్మనెంట్ చేయాలని కోరారు. రాం సుబ్బారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, ప్రదీప్, గౌతమ్, హేమకుమార్, ప్రవీణ్ దీక్షలో కూర్చున్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications