రోహిత్ ఆత్మహత్య ఘటనపై జూడిషియల్ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ
న్యూఢిల్లీ: హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టిన ఏకసభ్య న్యాయ సంఘం.. ఈ ఘటనపై ప్రజాభిప్రాయాలను తీసుకోనుంది. ఈ కమిషన్ను కేంద్ర మానవనరుల శాఖ నియమించింది.
కాగా, న్యాయ సంఘానికి నేతృత్వం వహిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అశోక్కుమార్ రూపన్వాల్ ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
[email protected] అనే ఈ-మెయిల్ చిరునామాకు ఫిబ్రవరి 21లోగా ప్రజలు తమ అభిప్రాయాలను పంపించవచ్చని తెలిపారు. కాగా, విద్యార్థి సంఘాలకు 23న అవకాశం కల్పించారు. విద్యార్థి సంఘాలు, బోధన/ బోధనేతర సిబ్బంది ప్రతినిధులు ఫిబ్రవరి 23న హైదరాబాద్లోని యూజీసీ ప్రాంతీయ కార్యాలయంలో కమిషన్ను కలిసేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

వార్డెన్లు, విద్యార్థి సంక్షేమం చూసే డీన్, సమానావకాశాల విభాగం అధికారులు, ఎస్సీ-ఎస్టీ విభాగ అధికారులు, ర్యాగింగ్ నిరోధక విభాగం బాధ్యులు తమను ఫిబ్రవరి 24న కలవవచ్చని కమిషన్ తెలిపింది.
హెచ్సీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు, తాత్కాలిక వీసీ ఆచార్య ఎం పెరియస్వామి, ఇతర సీనియర్ అధికారులు, రిజిస్ట్రార్లు ఫిబ్రవరి 25వ తేదీన కలవవచ్చు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్న యంత్రాంగాన్ని కమిషన్ సమీక్షిస్తుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications