రికార్డు చేయాలి: ఉద్యమ డైరీ ఆవిష్కరణలో కోదండరామ్
హైదరాబాద్: ఉద్యమం సందర్భంగా చోటు చేసుకుని అనేక సంఘటనలను రికార్డు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఉద్యమ డైరీ పుస్తకం ఉద్యమ చరిత్రను తెలుసుకోవడానికి పనికి వస్తుందని చెప్పారు.
పిట్టల రవిందర్ రచించిన ‘తెలంగాణ ఉద్యమ డైరీ' పుస్తకావిష్కరణ జరిగింది. శనివారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.

చరిత్రను సృష్టించిందే తెలంగాణ వాళ్లు అని అన్నారు. మన చరిత్రను మనమే రాసుకునే అవకాశం వచ్చిందని ఘంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ ఉద్యమానికున్న ప్రామాణికత ఉద్యమ డైరీలో తెలుస్తుందన్నారు. ఉద్యమంలో ఉద్యోగులు నిర్వహించిన పాత్రను రవీందర్ వివరించారని చెప్పారు.
తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఎక్కడా అని అడుగుతున్నారని, కానీ చరిత్రకు ప్రామాణికత అవసరంలేదని వివరించారు. ఉద్యమంలో పాల్గొన్న వారే ఇవాళ తెలంగాణ చరిత్రను రాస్తున్నారని వివరించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications