అంబానీ, అదానీలకు రుణమాఫీ..తప్పని నిరూపిస్తే రేపే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఒకరి మీద ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక నిన్నటిదాకా రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాళ్ల పర్వం కొనసాగితే, నేడు బిజెపినేతలైన బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
బడా కార్పొరేట్లకు రుణమాఫీ ఎలా చేశారు?
బడా కార్పొరేట్లు అయిన అదాని, అంబానీలకు 14న్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను ప్రధాని నరేంద్ర మోదీ మాఫీ చేయలేదని, బండి సంజయ్, కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఉచితాలు ఇస్తే ప్రధానమంత్రి మోదీ అనుచితం అంటారని, కానీ బడా కార్పొరేట్లకు రుణమాఫీ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.

రాజకీయాల కోసం మతాన్ని వాడుకున్నామా
బడా కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం రుణమాఫీ చేసిన డబ్బు పదేళ్ళ పాటు దేశం మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి పనికొచ్చేది అని అన్నారు. తాము రాజకీయాల్లో ఎప్పుడైనా మతాన్ని వాడుకున్నామా చెప్పాలని ప్రశ్నించిన కేటీఆర్, తాము అత్యంత అద్భుతంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించామని, కానీ దానిని రాజకీయాల కోసం వాడుకోలేదన్నారు.
మోదీ దేనికి దేవుడు.. మాట్లాడితే జై శ్రీరామ్ దేనికి
బిజెపి నేతలు మాట్లాడితే జైశ్రీరామ్ అంటూ అయోధ్య అంశాన్ని తెరమీదకు తెస్తారని, అయోధ్య పేరుతో కూడా రాజకీయం చేస్తారని విమర్శించారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న వారు చేసిన పనిని చెప్పుకోలేని దద్దమ్మలు బిజెపి నేతలని విమర్శించారు. మోదీని బిజెపి నేతలు దేవుడు అంటున్నారని, అసలు మోదీ దేనికి దేవుడని ప్రశ్నించారు. కరోనా లాక్డౌన్ సమయంలో కర్షకులు, కార్మికులను చావగొట్టినందుకా మోదీ దేవుడన్నారు.
Live: BRS Working President @KTRBRS Participating in May Day Celebrations at Telangana Bhavan. https://t.co/fcuAu9Ybyq
— BRS Party (@BRSparty) May 1, 2024
మోదీకి ఇందుకేనా ఓటెయ్యాలి
సెస్ ల పేరుతో ప్రజల తోలు పిండి 30 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా మోదీకి ఓటెయ్యాలి అన్నారు. మోడీకి బడా పారిశ్రామికవేత్తలు తప్ప సామాన్యులు కనిపించరని, అందుకే వారికి రుణమాఫీ చేశారన్నారు. తాను చెప్పింది అబద్ధం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు
ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసిన కేటీఆర్ తెలంగాణలో కేసీఆర్ ను లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణా నే లేకుండా చేయాలన్నారు. అది జరిగేది కాదని స్పష్టం చేశారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications