కేసీఆర్ కు సిట్ నోటీసుల పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం...!!
తెలంగాణలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ కు సిట్ నోటీసుల వ్యవహారం సంచలనంగా మారుతోంది. కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ హాజరు పైన ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. అయితే, కేసీఆర్ సిట్ విచారణకు హాజరు వేళ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. కీలక చర్చలు జరుగుతున్నాయి. సిట్ నోటీసులు.. విచారణ పైన మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
సిట్ మరో సారి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని సిట్ స్పష్టం చేసింది. అయితే, న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుస మంతనాలు సాగిస్తున్నారు. నోటీసు జారీ చేసిన తీరు పైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు చెల్లవనే వాదన తెర మీదకు తెస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ హాజరు పైనా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా.. ఈ పరిణామాల పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు...'తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి.. పైశాచిక ఆనందం పొందడం దారుణం' అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

హాజరవుతారా.. సమయం కోరుతారా
దీనికి కొనసాగింపుగా ఇది కేవలం 'పైశాచిక ఆనందం' పొందడమేనని కేటీఆర్ విమర్శించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు ఉంటున్న నివాసం వద్దే విచారించాలనే కనీస నిబంధనను పోలీ సులు అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) మీద అవగాహన ఉందా? లేక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రతిపక్షాలను వేధించ డమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. చట్టం, న్యాయంపై తమకు పూర్తి విశ్వాసం ఉంద ని, అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి చేస్తోన్న ప్రతి తప్పుడు పనిని ప్రజల ముందు పెడతామని, సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. దీంతో.. కేసీఆర్ మరోసారి సమయం కోరే అవకాశం ఉందనే అభిప్రాయం గులాబీ పార్టీ నేతల నుంచి వ్యక్తం అవుతోంది. కాగా.. కేసీఆర్ విచారణకు వస్తారా.. సమయం కోరుతారా.. మర సారి సమయం కోరితే సిట్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications