మందు బాబులకు గుడ్న్యూస్: 31న అర్ధరాత్రి వరకు లిక్కర్ అమ్మకాలు
హైదరాబాద్: తెలంగాణ సర్కారు మందుబాబులకు తీపికబురు చెప్పింది.
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.
బార్ అండ్ రెస్టారెంట్లలో రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయించేందుకు అవకాశం కల్పించారు. ఇది ఇలావుంటే, న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు కూడా పలు ఆంక్షలను విధించారు. త్రీ స్టార్, ఆపై హోటళ్లకు, పబ్బులకు ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని నిర్వాహకులను సూచించారు. పార్కింగ్ ప్రదేశాల్లోనూ కెమెరాలు తప్పనిసరి చేశారు.

అసభ్యకర నృత్యాలు లేకుండా చూడాలని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకల్లో శబ్ధ తీవ్రత 45 డెసిబెల్స్ కి మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేయవద్దని ఆదేశించారు. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని తేల్చి చెప్పారు.
మరోవైపు, నగరంలోని పలుమార్గాల్లోనూ పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. కొన్ని ఫ్లైఓవర్లపైకి అనుమతులను నిరాకరించే అవకాశం ఉంది. అంతేగాక, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించే అవకాశం ఉంది. నూతన సంవత్సర వేడుకలను మంచి వాతావరణంలో జరుపుకోవాలని, అందరూ సురక్షితంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications