హైదరాబాద్ లో సకల సౌకర్యాల రైల్వే స్టేషన్..!!
మలక్పేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపట్టిన ఈ పనులు 2026 జూన్ నాటికి పూర్తవుతాయని అంచనా. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్ పాతబస్తీ సహా పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు.
'నయా భారత్ నయా స్టేషన్'లో భాగంగా రూ. 26.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఆధునిక సౌకర్యాలు, మెట్రో అనుసంధానం, పర్యావరణ హితమైన డిజైన్తో ఈ స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. మలక్పేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా అనేక నూతన సదుపాయాలు కల్పించనున్నారు. మెరుగైన లైటింగ్, విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, అప్గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలం ఇందులో ఉన్నాయి.

దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ వినియోగంతో పర్యావరణ హితమైన భవనం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆధునిక వాస్తుశిల్పంతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో ఇది నగర కేంద్రంగా మారనుంది. కాచిగూడ- ఫలక్నుమా సబర్బన్ మార్గంలో.. పాతబస్తీలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న ఈ స్టేషన్ మలక్పేట, దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల ప్రయాణికులకు సేవలందిస్తుంది.
కాచిగూడ-కర్నూలు తుంగభద్ర ఎక్స్ప్రెస్, కాచిగూడ-గుంటూరు ఎక్స్ప్రెస్ వంటి ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ హాల్ట్ సౌకర్యం ఉంది. అభివృద్ధి పూర్తయ్యాక మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగనున్నాయని, ఇది మరింత మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ పునరాభివృద్ధిలో కొత్త ముఖద్వారం, రెండో ప్రవేశ మార్గంలో స్టేషన్ భవనం అభివృద్ధి, సర్క్యులేటింగ్ ఏరియా విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
భవిష్యత్ అవసరాల కోసం 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రూఫ్ ప్లాజా, మెట్రో కనెక్టివిటీతో అనుసంధానం వంటివి ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల కోసం లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ప్లాట్ఫారాల మెరుగుదల, కాన్కోర్స్, వెయిటింగ్ హాల్స్, వీఐపీ లాంజ్ ఇంటీరియర్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, కొత్త సైనేజ్, కొత్త ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ట్రైన్ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
-
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications