'ప్రైవేట్' ఫీజులు తగ్గించాలి: ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బీసీ సంఘం నేత
హైదరాబాద్: మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దందాపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల ముందు విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
ఇందులో భాగంగా మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులకు నిరసనగా సంగారెడ్డి శ్రీచైతన్య స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీసీ సంఘం నేత సిరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇది గమనించిన స్ధానికులు వెంటనే అతడిని పక్కనే ఉన్న బురదలోకి నెట్టారు. దీంతో అతడికి 20 నుంచి 30 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కొంత మంది యువకులు ఈ ధర్నా చేపట్టారు.

ఈ ఆందోళనలో పాల్గొన్న సిరిబాబు ఉన్నట్టుండి ఒక్కసారిగా తనవెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో సిరిబాబుకు కాళ్ల నుంచి పొట్టపై భాగం వరకు కాలిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కలెక్టరేట్కు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్కు తరలించారు. వైద్యులు కూడా అతడిని హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications