పట్టపగలే దొరికిపోయి కుడితిలో పడ్డ ఎలుకలా: బీజేపీపై హరీశ్ రావు విమర్శలు
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలే దొరికిపోవడంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. ప్రగతిభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
బీజేపీ నేతలు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ విచారణ ఆపాలని కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని హరీశ్ రావు మండిపడ్డారు. ఈ కేసులో పట్టుబడినవాళ్లతో తమకు సంబంధం లేదంటున్న బీజేపీ.. కోర్టులకు ఎందుకు వెళ్తోందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కుట్రలు బట్టబయలవుతాయనే విచారణ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణ పోలీసులపై బీజేపీ నేతలకు విశ్వాసం లేదా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనించాలన్న మంత్రి.. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణకు సహకరించాలని సూచించారు. గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందించారు. '' రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నవారు పద్ధతిగా మాట్లాడాలి. మేము మాట్లాడితే అంతకంటే ఎక్కువగా మాట్లాడుతాం. కానీ మేము అలా మాట్లాడం' అని అన్నారు. తుషార్ పేరు గవర్నర్ ఎందుకు ప్రస్తావించారో తెలియదన్నారు.
మరో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అనైతిక రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు సిట్ విచారణ ఆపాలనడం సిగ్గుచేటని.. ఏ సంబంధం లేకుంటే కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications