MLC Polling: మే 27న పోలింగ్, కౌంటింగ్ ఎప్పుడంటే..!
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సమయం అసన్నమైంది. మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక కూడా జరిగింది. ఇప్పుడు మరో ఉపఎన్నిక జరగనుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొదటగా 63 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 11 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
మే 27న 12 జిల్లాలో పరిధిలో ఉప ఎన్నిక జరగనుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 5న కౌటింగ్ ప్రారంభం అవుతుంది. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మొత్తం 4లక్షల 61వేల 806 మంది ఓటర్లు ఉన్నారు. డిగ్రి పూర్తి చేసిన వారుఓటు వేసేందుకు అర్హులు.

అయితే పట్టభద్రులు అయిన వారు ముందుగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి ప్రేమేంద్ర రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications