వదిలేది లేదు, ఎస్సైని సస్పెండ్: గ్యాంగ్రేప్పై నాయిని సీరియస్
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన పైన ప్రభుత్వం సీరియస్గా ఉందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం చెప్పారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఆయన చెప్పారు.
వీణవంక ఘటన పైన ఆయన సీరియస్ అయ్యారు. గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కేసును వేగంగా దర్యాఫ్తు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కేసును స్వయంగా డిజిపి అనురాగ్ శర్మ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలో సకాలంలో స్పందించని ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... జీవనోపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని కార్మికులకు హితవు పలికారు. విదేశాలకు వెళ్లాలని భావించే వారు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఐదువేల మందిని విదేశాలకు పంపిస్తామన్నారు.

చందంపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్కు తూటా గాయం
నల్గొండ జిల్లా చందంపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ వెంకటయ్యకు తూటా గాయమైంది. మిస్ఫైర్తో వెంకటయ్యకు తూటా గాయమైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కానిస్టేబుల్ వెంకటయ్య చందంపేట పీఎస్లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నారు. గాయపడిన వెంకటయ్యను ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. కానిస్టేబుల్ వెంకటయ్య 2013 బ్యాచ్కు చెందిన వ్యక్తి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications