నడిరోడ్డుపై కారు ఆపి డోరు తెరిచిన డ్రైవర్.. రెండేళ్ల చిన్నారి మృతి (వీడియో)
హైదరాబాద్: ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్లో నివసించే సయ్యద్ హబీబుద్దీన్, శశిరేఖ దంపతులకు రేఖ అనే రెండేళ్ల చిన్నారి ఉంది. శశిరేఖ బ్యూటీషియన్గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సేవలందించేందుకు మన్సూరాబాద్కు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో భర్త హబీబుద్దీన్, కుమార్తెతో కలిసి ఎన్టీఆర్ నగర్కు బయల్దేరారు.

గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కామినేని హాస్పిటల్ మార్గంలో ఆగివున్న ఓ కారు డోర్ను డ్రైవర్ హఠాత్తుగా తెరవడంతో వెనుక నుంచి వస్తున్న వీరి బైక్కు తగిలింది. దీంతో ముగ్గూరు రోడ్డుపై పడిపోయారు. చిన్నారి తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ధనలక్ష్మి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులు అప్పగించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారు డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వెనుక వచ్చే వారిని గమనించకుండా కారు డోరు తీసి ఓ చిన్నారి మరణానికి కారణమయ్యాడని మండిపడుతున్నారు.
నడిరోడ్డు మీద నిర్లక్ష్యం, పసిపిల్ల ప్రాణం తీసిన ప్రమాదం. ఎక్కడపడితే అక్కడ కార్ ఆపి, డోర్ తీసే ముందు చూసుకోక పోవడంతో జరిగిన దారుణం, ఎల్ బీ నగర్ లో కార్ డోర్ తగిలి రెండేళ్ళ చిన్నారి దుర్మరణం. pic.twitter.com/hapZF4ZYYY
— Nellutla Kavitha (@iamKavithaRao) June 2, 2023
కాగా, సకాలంలో తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లివుంటే బతికేదని చిన్నారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, ఘటనకు కారణమైన కారులోనే వెంటనే ఆస్పత్రికి తరలించివుంటే సరైన సమయంలోనే ఆస్పత్రికి చేరేవారిమని వాపోయారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications