టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అనే సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు. 2008లో తెలంగాణ జాగృతి స్థాపించి బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ అంతటా పర్యటిస్తూ సరికొత్త అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు.
Recommended Video

తనకంటూ ప్రజల్లో ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మధుయాస్కీ గౌడ్ను ఓడించి పార్లమెంటులో అడుగు పెట్టారు. నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయాల అమలులో కీలకంగా వ్యవహరిస్తూ వార్తల్లో ఉన్నారు. పార్లమెంటులో కూడా తెలంగాణ వాణిని వినిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సీఎం కూతురుగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కవిత.

ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. చాలా చురుగ్గా వ్యవహరించే తెలివైన రాజకీయ నాయకురాలిగా ముందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications