నోట్లు మారుస్తున్న మావోలు: 12లక్షలు సీజ్, ఇద్దరి అరెస్ట్
మావోయిస్టులు ఇచ్చిన డబ్బులను మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భద్రాచలం: మావోయిస్టులు ఇచ్చిన డబ్బులను మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలం అటవీ ప్రాంతంలో గజా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో త్రినాథరావు డిప్యూటీ ప్రాజెక్టు మేనేజరుగా, సిద్ధార్థ్ అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.

కాగా, గుర్తుతెలియని వ్యక్తులు కొందరు వారి వద్దకు వచ్చి తమనుతాము మావోయిస్టులుగా పరిచయం చేసుకున్నారు. తమ వద్ద ఉన్న పెద్దనోట్లను మార్చి ఇవ్వాలని వారిని కోరుతూ రూ.12 లక్షలు అప్పగించారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ సిద్ధార్థ్కు మంథన్గోడ్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ సత్యనారాయణాచారితో పరిచయం ఉండటంతో అతడిని కలిసి.. 15 శాతం కమిషన్పై నోట్లను మార్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి త్రినాథ్రావు, సిద్ధార్థ్లు డబ్బులు పట్టుకుని మంథన్గోడ్ చేరుకున్నారు. విషయం కాస్తా పోలీసులకు చేరడంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications