ప్రాజెక్టుల సెగ: 'హైదరాబాద్లో బాబు, మంత్రుల ఇంటికి నీళ్లు కట్ చేయాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి, డిండి, మేడిగడ్డ తదితర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని, ఈ ప్రయత్నాలను ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఓయూ జేఏసీ మంగళవారం మండిపడింది.
కేసీఆర్ భగీరథ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం హర్షిస్తోందని వారు అన్నారు. వీటిని ఓర్వలేక ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమని, వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గ తీర్మానం చేయడం అమానుషమన్నారు.
ఇది అమానవీయ చర్య అన్నారు. తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు నీటిని అడ్డుకుంటున్న చంద్రబాబు, ఆయన మంత్రులకు తెలంగాణ నీళ్లు తాగే హక్కు లేదని ధ్వజమెత్తారు. హైదరాబాదులోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రుల నివాసాలకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు వారు జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. వారికి నీరు, విద్యుత్ నిలిపివేయడంతో పాటు జీహెచ్ఎంసీ నుంచి అందుతున్న అన్ని సదుపాయాలను ఆపేయాలని కోరారు.
రైతాంగానికి నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు కుటుంబానికి, ఆయన మంత్రివర్గానికి హైదరాబాద్ నీళ్లు తాగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ రైతుల కన్నీళ్లు తాగి, రాజకీయ దాహం తీర్చుకునే కుట్రలు చేయడం చంద్రబాబుకు తగదని హితవు పలికారు.
పాత ప్రాజెక్టులను రీడిజైన్ చేయడంవలన తెలంగాణలో అదనంగా 11.15 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని చెప్పారు. దీనిని ఓర్వలేక ఏపీ మంత్రివర్గం తీర్మానాలు చేస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ టీడీపీ నేతలు తమ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయకపోవడం ఏమిటన్నారు. టీడీపీ జెండా గద్దెలను కూల్చి, తెలంగాణ టీడీపీ నాయకులపై భౌతిక దాడులు చేసే రోజులు త్వరలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications