తుపాకితో పట్టుబడిన పరిటాల రవి హత్య కేసు నిందితుడు, బెదిరించేందుకే
మెదక్: తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితుడుగా ఉన్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న మెదక్ జిల్లా నంగునూరు మండలం వెల్కటూరుకు చెందిన బత్తిని వెంకటస్వామిని పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు.
కొండపాక మండలం కొమురవెల్లి గేటు వద్ద వాహనాల తనిఖీల సందర్భంగా పట్టుకున్నట్లు తొగుట పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లాలో ఇటీవల తుపాకులు కలిగి ఉన్న నిందితుల అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా 9ఎంఎం తుపాకీతో పాటు మూడు తూటాలతో వెంకటస్వామి పట్టుబడ్డాడని పోలీసులు చెప్పారు.

వెంకట స్వామి టిడిపి నేత పరిటాల రవి హత్య కేసులో ఏ 17 నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ఆ కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవించి బెయిల్ పైన బయటకు వచ్చాడని పోలీసులు చెప్పారు. అనంతరం సొంత గ్రామంలో కల్లు దుకాణం నిర్వహించాడు.
సిద్దిపేట ప్రాంతంలో భూమి సెటిల్మెంట్లు చేసిన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. బెదిరింపులకు దిగేందుకు తుపాకీ కోసం కాన్పూరు వెళ్లి అక్కడ సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రెండు తుపాకులు కొన్నాడు. ఒకటి తన వద్ద ఉంచుకొని, మరొకటి వేరే వారికి అమ్మేశాడు. అతని వద్ద తుపాకీ కొనుగోలు చేసిన వారు అంతకుముందే పోలీసులకు పట్టుబడ్డారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications