తలసానికి షాకిచ్చేనా: సనత్నగర్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ యోచన?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సనత్ నగర్ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సనత్ నగర్ నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు.
ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పైన సభాపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజీనామాను స్పీకర్ ఆమోదించాక ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి తలసాని పోటీ చేస్తారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా పోటీపై అప్పుడే సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8, ఓటుకు నోటు అంశాలపై స్పందించిన పవన్ కళ్యాణ్ సనత్ నగర్ నుండి పోటీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే జనసేన పార్టీ పోటీ చేస్తుందని భావించినా అది జరగలేదు.
ఇప్పుడు పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మంత్రి తలసాని పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని పార్టీ మారి సనత్ నగర్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలరా అని ప్రశ్నించారు.
-
Revanth Reddy:కేరళం గడ్డపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..ఇద్దరి మధ్య సీక్రెట్ డీల్..!! -
2027 మార్చి తర్వాతే జిల్లాల మార్పులు : సీఎం రేవంత్ రెడ్డి -
మహిళలకు తులం బంగారం హామీ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన! -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications