నిన్న కేటీఆర్ సూచన.. బ్రాండ్ అంబాసిడర్గా సిద్ధమని స్వయంగా పవన్ కళ్యాణ్
'చేనేత'కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా ప్రకటించారు.
హైదరాబాద్: చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత కార్మికులకు ఊతమివ్వాలని ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
చేనేత కార్మికుల దీనస్థితిపై పవన్ కళ్యాణ్ చలించిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

తెలంగాణ చేనేత అఖిల పక్షం ఐక్య వేదిక, ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ని కలిశారు.

తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల ఆకలి చావులను ఈ సందర్భంగా పవన్ దృష్టికి తీసుకు వచ్చారు.
వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న 'చేనేత సత్యాగ్రహం' కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. వారి ఆహ్వానానికి అంగీకారం తెలిపారు. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 'చేనేత'కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని స్వచ్ఛందంగా ప్రకటించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే చేనేత ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో 45 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంపై పవన్ కలత చెందారు.

కాగా, పదిహేను రోజుల క్రితం మంత్రి కేటీ రామారావు చేనేత వస్త్రాలు ధరించి కార్యాలయానికి వచ్చారు. ప్రతి సోమవారం చేనేత దుస్తుల్లో వస్తానని చెప్పారు. అన్నట్లుగా ఆయన చేనేత వస్త్రాలు ధరించి వచ్చారు. అంతేకాదు, నాగార్జున, కమల్ హాసన్, సానియా మీర్జా, మంచులక్ష్మి, సమంత, మహేష్ బాబులకు కూడా చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications