Phone tapping case: రేవంత్రెడ్డి ఇంటి దగ్గరలో వార్రూమ్; తెరపైకి ఓటుకు నోటు వ్యవహారం!!
ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతుంది అనేది తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలను బట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే అనేకచోట్ల వార్ రూములను ఏర్పాటుచేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు, తాజాగా రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోని ఒక గెస్ట్ హౌస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు.
రేవంత్ ఇంటికి సమీపంలో గెస్ట్ హౌస్
రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఒక గెస్ట్ హౌస్ తీసుకొని రేవంత్ తో పాటు ఆయన సన్నిహితుల పై నిఘా పెట్టారు. అంతేకాదు ఈ గెస్ట్ హౌస్ కేంద్రంగా భారీ సెటిల్మెంట్లు కూడా చేసినట్లు సమాచారం.

ఫోన్ ట్యాపింగ్ తోనే ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి
ఇక ఈ విషయాన్ని తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధా కిషన్ రావు ను విచారిస్తున్న క్రమంలో అధికారులు గుర్తించారు. దీంతో ఆ గెస్ట్ హౌస్ లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 2015 లో జరిగిన ఓటుకు నోటు వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.
రేవంత్ రెడ్డిని పట్టుకోవటం వెనుక ఫోన్ ట్యాపింగ్
ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వెనుక ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ వ్యూహం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మాత్రమే కాదు 2022 లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగినట్టు సమాచారం. అయితే 2018 తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త పుంతలు తొక్కింది.
సూట్ కేసులో ఇమిడిపోయే ట్యాపింగ్ పరికరం
ప్రణీత్ రావు, తిరుపతన్న, వేణుగోపాలరావు తదితరులను ఎస్ఐబి లోకి తీసుకున్న తర్వాత భుజంగరావు పొలిటికల్ ఇంటిలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకరరావు ఫోన్ ట్యాపింగ్ ను మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్లారు. విదేశాల నుండి కావలసిన ఉపకరణాలను తెప్పించి సూట్ కేసులో ఇమిడిపోయే విధంగా ట్యాపింగ్ పరికరాన్ని మ్యాన్ ఇన్ ది మిడిల్ ఎటాక్స్ కు ఉపయోగించేవారు.
రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, సన్నిహితుల ఫోన్లు ట్యాప్
ప్రణీత్ రావు టీమ్ ఫోన్ ట్యాపింగ్ పరికరాన్ని ఒక వాహనంలో పెట్టుకొని, ఎవరైతే టార్గెట్ నో వారి ఇంటికి సమీపంలో వెళ్లి అక్కడ 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ ను తెలుసుకునేవారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో కూడా రేవంత్ రెడ్డి కుటుంబీకులతో పాటు, ఆయన ప్రధాన అనుచరులు, సన్నిహితులతో జరిగిన ఫోన్ సంభాషణలను తెలుసుకున్నట్టుగా గుర్తించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications