హోంగార్డ్లు షాకిచ్చారు, దినేష్తో కేసీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు.
గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విధి నిర్వహణలో పోలీసుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రజల మాన, ప్రాణ రక్షణలో పోలీసుల సేవలు గొప్పవన్నారు. సింగపూర్ తరహాలో భద్రతను పటిష్టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

పోలీసు అమరవీరుల దినం
కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సీయూజీ ఫోన్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. పోలీసులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు.

పోలీసు అమరవీరుల దినం
ఎస్సైలకు గెజిటెడ్ హోదా కల్పిస్తామని కేసీఆర్ వెల్లడించారు. సంఘవిద్రోహ శక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు వందశాతం పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

పోలీసు అమరవీరుల దినం
విధినిర్వహణలో చనిపోయిన పోలీసులకు పరిహారం పెంచనున్నట్లు ప్రకటించారు. కానిస్టేబుల్కు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు ఇస్తామన్నారు.

పోలీసు అమరవీరుల దినం
ఎస్సైలకు రూ 35 లక్షల నుంచి రూ. 45 లక్షలు, సీఐ, డీఎస్పీలకు రూ. 45 లక్షల నుంచి రూ.50 లక్షలు, ఐపీఎస్ అధికారులకు రూ.50 లక్షల నుంచి కోటి పరిహారాన్ని పెంచనున్నట్లు తెలిపారు.

పోలీసు అమరవీరుల దినం
ప్రతిభ కనబర్చిన 20 మందికి మెడల్స్, రూ.5 లక్షలు ప్రోత్సాహం ఇస్తామన్నారు. జీతభత్యాలపై హోంగార్డులకు కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం పట్ల సంస్మరణ సభలో హోంగార్డులు నిరసన వ్యక్తం చేశారు.

పోలీసు అమరవీరుల దినం
పోలీసులు అమరవీరుల త్యాగాలు అమూల్యమైనవని, వెలకట్టలేనివని కేసీఆర్ అన్నారు. ఏటా అమరులను స్మరించుకోవడం మంచి సంప్రదాయమన్నారు.

పోలీసు అమరవీరుల దినం
పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికే మంచిది కాదన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారు దేవుడితో సమానమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పోలీసు అమరవీరుల దినం
అమరవీరుల కుటుంబాలకు వంద శాతం అండగా ఉంటామని ముఖ్యమంత్రి చెప్పారు. భద్రత పెట్టుబడులు వస్తాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

పోలీసు అమరవీరుల దినం
సింగపూర్ తరహాలో భద్రత మరింత పటిష్టం చేస్తామని, ధన, మాన, ప్రాణ రక్షణలో పోలీసులు విజయం సాధించాలని ఆకాంక్షించారు.

పోలీసు అమరవీరుల దినం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో తమ గురించి కనీసం ఒక్కమాటైనా కేసీఆర్ మాట్లాడలేదని హోం గార్డులు వాపోయారు.

పోలీసు అమరవీరుల దినం
తమ అభివృద్ధి కోసం ఎన్నో చేస్తానని గతంలో ప్రకటించిన కేసీఆర్... వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసు అమరవీరుల దినం
తన ప్రసంగంలో హోంగార్డుల సమస్యలను లేవనెత్తలేదని నిరసన వ్యక్తం చేశారు. తమకు వెంటనే జీతాలు పెంచాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని హోంగార్డులు డిమాండ్ చేశారు.

పోలీసు అమరవీరుల దినం
కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సీయూజీ ఫోన్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. పోలీసులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు.

పోలీసు అమరవీరుల దినం
ఎస్సైలకు గెజిటెడ్ హోదా కల్పిస్తామని కేసీఆర్ వెల్లడించారు. సంఘవిద్రోహ శక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు వందశాతం పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

పోలీసు అమరవీరుల దినం
విధినిర్వహణలో చనిపోయిన పోలీసులకు పరిహారం పెంచనున్నట్లు ప్రకటించారు. కానిస్టేబుల్కు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు ఇస్తామన్నారు.

పోలీసు అమరవీరుల దినం
ఎస్సైలకు రూ 35 లక్షల నుంచి రూ. 45 లక్షలు, సీఐ, డీఎస్పీలకు రూ. 45 లక్షల నుంచి రూ.50 లక్షలు, ఐపీఎస్ అధికారులకు రూ.50 లక్షల నుంచి కోటి పరిహారాన్ని పెంచనున్నట్లు తెలిపారు.

పోలీసు అమరవీరుల దినం
ప్రతిభ కనబర్చిన 20 మందికి మెడల్స్, రూ.5 లక్షలు ప్రోత్సాహం ఇస్తామన్నారు. జీతభత్యాలపై హోంగార్డులకు కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం పట్ల సంస్మరణ సభలో హోంగార్డులు నిరసన వ్యక్తం చేశారు.

పోలీసు అమరవీరుల దినం
పోలీసులు అమరవీరుల త్యాగాలు అమూల్యమైనవని, వెలకట్టలేనివని కేసీఆర్ అన్నారు. ఏటా అమరులను స్మరించుకోవడం మంచి సంప్రదాయమన్నారు.

పోలీసు అమరవీరుల దినం
పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికే మంచిది కాదన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారు దేవుడితో సమానమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

పోలీసు అమరవీరుల దినం
అమరవీరుల కుటుంబాలకు వంద శాతం అండగా ఉంటామని ముఖ్యమంత్రి చెప్పారు. భద్రత పెట్టుబడులు వస్తాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు.












Click it and Unblock the Notifications