ఖా'కీచకం'.. తల్లితో సహజీవనం; బిడ్డపై అత్యాచారం; పోక్సో కేసు నమోదు!!
ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలు ఆ పనిని మరిచిపోయి అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలికలకు రక్షణ కల్పించాల్సిన ఒక పోలీసు, ఓ బాలికను చెరబట్టడం, ఆమెపై అత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. దీంతో అతనిపై అత్యాచారం తో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం భూపాలపల్లి వి ఆర్ సి ఐ గా పనిచేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేశారు. హనుమకొండలోని ఒక కాలనీలో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయన అనంతరం ఖమ్మం జిల్లాకు బదిలీ అయినప్పటికీ సదరు మహిళతో తన సంబంధాన్ని కొనసాగించారు.

ఆపై విఆర్ సీఐగా భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. సంపత్ ను నమ్మిన సదరు మహిళ భర్తను వదిలిపెట్టి సంపత్ తో సహజీవనం సాగిస్తోంది. ఆమెకు ఒక కూతురు ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్మీడియట్ చదువుతుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఖాకీ అక్కడితో ఆగకుండా ఆమె కూతురు పైన కూడా కన్నేశారు.
గత కొద్ది రోజులుగా సదరు మహిళ 16 సంవత్సరాల కూతురు పైన కామ వాంఛ పెంచుకున్న సదరు పోలీసు వావి వరసలు మరిచి పదహారేళ్ల మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు, ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలిని విచారించి, సంపత్ అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత సీఐ సంపత్ పైన కేసు నమోదు చేశారు. ఆయన పైన అత్యాచారం తో పాటు ఫోక్స్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా సంపత్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications