కెసిఆర్ వెళ్లగానే భారీ వర్షాలు.. చైనాలోనే ఉండు, ఏపీతో పోటీపడు: పొన్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్ చైనా పర్యటనకు వెళ్లగానే వర్షాలు పడ్డాయని, కేవలం లింబయ్య మృతి విషయంలోనే ప్రభుత్వం నివేదిక ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 1300 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రాజధానిలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క లింబయ్య మృతి విషయంలోనే నివేదిక ఎందుకు ఇచ్చారని నిలదీశారు. రుణమాఫీ, మద్దతు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారని, మరి మిగతా జిల్లాలలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అప్పుల్లో కూరుకుపోయిన ఏపీతో పోటీ పడి ధనిక రాష్ట్రమైన తెలంగాణ రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కెసిఆర్ చైనా వెళ్లగానే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయన్నారు. కెసిఆర్ చైనా నుంచి రాష్ట్రానికి వచ్చనా ఎటూ ఆయన ఫాంహౌస్ నుంచే పరిపాలన చేస్తారు కాబట్టి ఇంకా రెండేళ్లపాటు చైనాలోనే ఉంటే వర్షాలు కురుస్తాయన్నారు.
రాష్ట్రంలో వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం వాటి పైన ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. రాజధాని నడిబొడ్డున లింబయ్య ఆత్మహత్య ఘటనను కూడా ప్రభుత్వ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బతికే అవకాశమున్న తెలంగాణ కావాలన్నారు.
ముష్టివేసినట్లు మాఫీనా: కోమటిరెడ్డి
ముష్టివాళ్లకు బిక్షం వేసినట్లు దఫాల వారిగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల ఆత్మహత్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రూ.3 కోట్లతో ప్రత్యేక విమానంలో చైనా వెళ్లేందుకు ప్రభుత్వం వద్ద డబ్బుంది కానీ, రైతు కుటుంబాలను ఆదుకునేందుకు లేవా అని ప్రశ్నించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications