Ration Card Ekyc: రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 31 చివరి తేదీగా ప్రకటన..

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు గురించి కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు కేవైసీపై కొత్త అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డుదారులు 2024 జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఈకేవైసీ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో దాదాపు 70 శాతం పూర్తి అయిందని అధికారులు చెప్పారు.

ఈకేవైసీలో మేడ్చల్ మాల్కజిగిరి జిల్లా 87.8 శాతంతో టాప్ లో ఉంది. ఇంకా ఎవరైనా చేయనివారుంటే జనవరి 31లోపు పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గురించిన కేంద్రం ఆధార్ నంబర్‌తో లింక్ (ఈ కేవైసీ) చేయాలని కోరుతోంది.

Ration cardholders are advised to complete this KYC by January 31, 2024
ఇందుకు సంబంధించి పలుమార్లు గడువును పొడగించింది. ఈ గడువును తాజాగా మరోసారి పొడగించింది. ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకోని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది. రేషన్ కార్డులో పేరున్న వారు చాలా మంది చనిపోయారు. వారు చనిపోయినా కూడా వారి పేరు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు.

మరి కొంత మంది ఆడ వారు పెళ్లై అంతారింటికి వెళ్లారు. వారి పేరు కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ కార్డు ఈకేవైసీ చేయడం వల్ల బతికున్న వారే ఈకేవైసీ చేసుకుంటారు. ఈకేవైసీ చేసుకోని వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+