వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీలో ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలనకు స్వస్తి చెప్పారని..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలనకు స్వస్తి చెప్పి రాజకీయ కక్ష సాధిస్తున్నారని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలనకు స్వస్తి చెప్పి రాజకీయ కక్ష సాధిస్తున్నారని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం టిడిపి నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ని కలిసింది.
అనంతరం రేవంత్ విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా పార్టీలను విలీనం చేసినట్లు స్పీకర్ బులెటిన్ విడుదల చేశారన్నారు.
రాజకీయ పార్టీల విలీనం ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని, స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన చట్టం, రాష్ట్రపతి ఉత్తర్వులను, ఉల్లంఘిస్తూ జిల్లాల ఏర్పాటు చేశారని, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు.
Comments
English summary
Telangana Telugudesam Party leader Revanth Reddy on Tusesday complaint against Speaker Madhusudhana Chary.
Story first published: Tuesday, March 21, 2017, 19:16 [IST]