మోడీ, అమిత్ షాను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి: కేసీఆర్పై సెటైర్లు
కరీంనగర్: అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఆరోపించారు. జమ్మికుంట జన జాతర సభ, భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనతోనే బీజేపీ 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారన్నారు. అందుకోసమే 400 స్థానాల్లో గెలిపించాలని బీజేపీ అడుగుతుందని, మళ్లీ గెలిస్తే మాత్రం రిజర్వేషన్లు రద్దు అవుతాయని చెప్పుకొచ్చారు. బీజేపీతో తాను పొత్తు పెట్టుకున్నానని కేసీఆర్ చెబుతుండటం హాస్యాస్పదమన్నారు రేవంత్.

మెున్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ను తలపిస్తే.. అందులో కేసీఆర్ను చిత్తుచిత్తుగా ఓడించారని అదే స్ఫూర్తితో ఫైనల్స్లో మోడీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్కు తెచ్చింది ఏం లేదన్నారు. పదేళ్లలో తెలంగాణకు మోడీ ఇచ్చింది శూన్యమని, గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, అందుకే కేసీఆర్ బస్సులో తిరుగుతున్నారని అన్నారు. తనను అరెస్ట్ చేయాలని అమిత్ షా ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించారని చెప్పుకొచ్చారు. గుజరాత్ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందామన్నారు. ఢిల్లీ పోలీసులు కాదు.. సరిహద్దులో సైనికుల్ని తెచ్చుకున్నా భయపడను అని రేవంత్ అన్నారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు.
-
చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications