Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ TO కర్ణాటక ట్రిప్.. తక్కువ బడ్జెట్ లో.. న్యూ ఇయర్ ఆఫర్..

న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కొత్త సంవత్సరాన్ని ఉల్లాసంగా.. మరింత ఉత్సాహంగా ప్రారంభించేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ (IRCTC) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా కర్ణాటక ట్రిప్ ను తక్కువ ధరకే ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి బడ్జెట్ లో కర్ణాటకలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టేసి రావచ్చు. మొత్తం 6 రోజుల టూర్ లో భాగంగా.. మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరితో పాటు పలు ప్రాంతాలను సందర్శించొచ్చు.

కొత్త సంవత్సరాన్ని మరింత నూతనంగా ప్రారంభించేందుకు.. IRCTC ప్రత్యేక దేవాలయాల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కర్ణాటకలో అనేక చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. కర్ణాటకలోని సముద్ర తీరంలో ఉన్న మురుడేశ్వర్, శృంగేరీ, ఉడిపి ప్రాంతాలను చూసేందుకు IRCTC ఈ ప్రత్యేక ట్రిప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి బడ్జెట్ లోనే ఈ టూర్ ను ఆస్వాదించవచ్చు.

ఇక ఈ ప్యాకేజీ విషయానికి వస్తే.. జనవరి 6, 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలోనూ వెళ్లొచ్చు. టూర్ లో భాగంగా మొదటి రోజు ఉదయం 6 గంటల 5 నిమిషాలకు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి కాచిగూడ TO మంగళూరు సెంట్రల్‌ ఎక్స్‌ ప్రెస్‌ (నెంబర్​ 12789) ట్రైన్ స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.

రెండో రోజు ఉదయం 10 గంటలకు మంగళూరు స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉడిపి వెళ్తారు. ఉడిపిలోని శ్రీ కృష్ణ టెంపుల్ అలాగే మాల్పె బీచ్‌ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు. ఇక మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్లి మూకాంబిక ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం మురుడేశ్వర్ వెళ్లి భారీ శివుడి విగ్రహాన్ని దర్శించుకుంటారు. అక్కడి బీచ్ లను చూసి తిరిగి ఉడిపి చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.

ఇక నాలుగో రోజు ఉదయం ఉడిపి నుంచి హోర్నాడు వెళ్తారు. అక్కడ అన్నపూర్ణ ఆలయాన్ని దర్శించుకుని శృంగేరికి చేరుకోవాలి. అక్కడే శారదాంబ ఆలయం సందర్శించిన తర్వాత సాయంత్రం మంగళూరు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది. ఐదో రోజు మొత్తం మంగళూరులోని మంగళాదేవి, కద్రి మంజునాథ, కుండ్రోలి గోకర్నాథ ఆలయాలు దర్శించి, తన్నేర్బవి బీచ్​లో కొద్దిసేపు ఎంజాయ్​ చేసి అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు కాచిగూడ చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

Ring in the New Year in Karnataka Budget IRCTC Tour from Hyderabad

ఇక ఈ ప్యాకేజీ ధరల వివరాలు ఓసారి చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 41,630 ఉంటుంది. అలాగే డబుల్ షేరింగ్ కు రూ. 23,670 ఉంటుంది. ఇక ట్రిపుల్ షేరింగ్ ధర రూ.19,000 గా ఉంది. కంపోర్ట్ క్లాస్ 3Aలో అయితే ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 15,970, సింగిల్ షేరింగ్ కు రూ. 38, 600.. డబుల్ షేరింగ్ రూ. 20, 650గా ఉంది. పిల్లలకు సెపరేట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం 8287932229 లేదా 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ప్యాకేజీ వివరాల కోసం IRCTC టూరిజం వెబ్ సైట్ https://www.irctctourism.com/ ను సందర్శించవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+