పెళ్లై నెల కూడా కాలేదు: కొత్త జంటను వెంటాడిన మృత్యువు
కరీంనగర్: ఎన్నో ఆశలు.. మరెన్నో ఊసులు, కలలతో కొత్తగా దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన ఆ జంటను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ కొత్త జంట మరణంతో ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకుంది.
ఈ ఘటన జగిత్యాల మండలం చల్గల్-తాటిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లి వచ్చిన జగిత్యాల మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన నాగపూరి నరేశ్ (25), సారంగపూర్ మండలం తుంగూరుకు చెందిన మంగ(23)లకు ఆగస్టు 23న వివాహం జరిగింది.

కాగా, మంగళవారం దంపతులిద్దరూ బైక్పై మేడిపల్లి మండలం కొండాపూర్లోని నరేశ్ అమ్మమ్మ ఇంటికెళ్లారు. అయితే, తిరుగు ప్రయాణంలో వారిని మృత్యువు వెంటాడింది.
నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ.. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరు నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. తాటిపల్లి గ్రామస్థులు లారీని వెంబడించి మేడిపల్లి వద్ద పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నవదంపతుల మృతితో ఇరు కుటుంబాలతోపాటు వారి రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications