యస్ మార్ట్ షోరూంకి ఇలా కన్నం వేశారు: రూ. లక్షల పరికరాల చోరీ(పిక్చర్స్)
హైదరాబాద్: ఎల్బీనగర్లోని యస్ మార్ట్ షోరూంలో భారీ చోరీ జరిగింది. స్థానిక చింతలకుంటలో ఉన్న యస్ మార్ట్ షోరూంలో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
షోరూం వెనుక గోడకు కన్నం వేసిన దుండగులు షాపులోని రూ. 5 లక్షల విలువైన ఎలక్ర్టానిక్ వస్తువులు అపహరించారు. బుధవారం ఉదయం వచ్చిన పాపు యజమానులు, చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
యస్ మార్ట్ షోరూంకి కన్నం
హైదరాబాదులోని ఎల్బీ నగర్ యస్ మార్ట్లో మంగళవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది.
యస్ మార్ట్ షోరూంకి కన్నం
దుకాణం వెనుక భాగంలో కన్నం వేసి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ వస్తువులను దోచుకెళ్లారు.
యస్ మార్ట్ షోరూంకి కన్నం
షోరూం వెనుక గోడకు భారీ కన్నమేసిన దొంగలు గుట్టుచప్పుడు తమ పని కానిచ్చారు.
యస్ మార్ట్ షోరూంకి కన్నం
బుధవారం ఉదయం షాపుకు వచ్చిన సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యస్ మార్ట్ షోరూంకి కన్నం
ఎల్బీనగర్లోని యస్ మార్ట్ షోరూంలో భారీ చోరీ జరిగింది. స్థానిక చింతలకుంటలో ఉన్న యస్ మార్ట్ షోరూంలో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.