Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైదాబాద్ బాలిక అత్యాచారం, హత్య: నిందితుడి అరెస్ట్, పోస్టుమార్టం రిపోర్టులో తేలిన ఘోరం

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాల్లో అరెస్ట్ చేశారు. రాజు స్వగ్రామం అడ్డగూడూరులో అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలికల అనుమానాస్పద రీతిలో శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యమవడంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తూర్పు మండలం డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Saidabad girl rape and murder: accused arrested in 48 hours.

కాగా, బాలిక మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులుకు అప్పగించారు.

నిందితుడు రాజు గురువారం సాయంత్రం బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పరుపులో మూటకట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు బాలిక కోసం వెతకగా.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి రాజు ఇంటిని పరిశీలించగా బాలిక శవమై కనిపించింది. అనంతరం బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన రాజును కాల్చి చంపాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

మరోవైపు ఆందోళనకారుల వద్దకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, డీసీపీ రమేశ్ రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, డబుల్ బెడ్ రూం ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని బాధిత కుటుంబానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి జైలు శిక్ష పడేలా చేస్తామన్నారు.

ఈ ఘటన జరగడం దురదృష్టమని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి అన్నారు. పాప డెడ్ బాడీ తరలించే టైంలో పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. పాప డెడ్ బాడీకి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం జరుగుతోందని తెలిపారు. మరో రెండు గంటల్లో నిందితున్ని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి తొందరగా శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. మరోవైపు చిన్నారి ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Recommended Video

    Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Oneindia Telugu

    ఇది ఇలావుండగా, ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాలిక కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణం రూ.50వేల ఆర్ధిక సాయం ప్రకటించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్లతో మాట్లాడారు మంత్రి సత్యవతి రాథోడ్‌. తగిన చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. దోషులు ఎంతటివారైన ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+