సికింద్రాబాద్- విశాఖ రైలు ప్రయాణికులకు గమనిక.. !!
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే దురంతో ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచనలు చేశారు. ప్రయాణికులు కోరుకున్నట్లుగా ఈ రైలు బోగీల కూర్పులో మార్పులు చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ కూర్పు అమలులోకి వస్తుంది. ఈ మార్పులు ఇక శాశ్వతం. ఇవి మొత్తం రెండు దశలుగా అమలులోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు లేదా శాశ్వత ప్రాతిపదికన కొనసాగుతాయి.
ప్రయాణికుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని 22204/22203 విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ రైళ్ల కూర్పును శాశ్వత ప్రాతిపదికన సవరించాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్పులు రెండు దశల్లో అమలు కానున్న ఈ మార్పులకు మార్చి 25వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. తాత్కాలిక కూర్పు మార్చి 25 నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

నంబర్ 22204 సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో మార్చి 25 నుండి ఏప్రిల్ 22 వరకు, నంబర్ 22203 విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో మార్చి 26 నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు సవరించిన కూర్పుతో నడుస్తాయి. ఈ తాత్కాలిక కూర్పులో మొత్తం 22 కోచ్లు ఉంటాయి: ఫస్ట్ ఏసీ- 1, 2ఏసీ- 4, 3ఏసీ- 12, స్లీపర్ బోగీలు- 3, దివ్యాంగులు- 2 కోచ్లు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు వీటికి అందుతున్న ప్రయాణికుల ఆదరణ గురించి తెలుసుకుంటారు.
అనంతరం అదే నెల 25వ తేదీ నుండి ఈ రైళ్లు శాశ్వత ప్రాతిపదికన సవరించిన కూర్పుతో నడుస్తాయి. నంబర్ 22204 సికింద్రాబాద్- విశాఖపట్నం దురంతో ఏప్రిల్ 25 నుండి, నంబర్ 22203 విశాఖపట్నం- సికింద్రాబాద్ ఏప్రిల్ 26 నుండి కొత్త కూర్పును కలిగి ఉంటాయి. ఈ శాశ్వత కూర్పులో మొత్తం 21 కోచ్లు ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఏసీ- 1, 2ఏసీ- 4, 3ఏసీ- 14, దివ్యాంగులు- 2 కోచ్లు ఉంటాయి. వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె పవన్ కుమార్ ఆ వివరాలను వెల్లడించారు.
-
భారీ ప్రాజెక్టులతో దేశంలోనే కీలక రైల్వే హబ్ గా చరిత్ర సృష్టించనున్న వరంగల్! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..!












Click it and Unblock the Notifications