సకాలంలో పనులు చేయకుంటే చర్యలు తప్పవు : సీతారామ ప్రాజెక్టు గుత్తేదారుపై స్మితా ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం : సాగునీటి ప్రాజెక్టుల్లో ఆలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టంచేశారు సీఎంవో ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనుల ఆలస్యంపై ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇవాళ పనుల తీరును ఆమె పరిశీలించారు. అయితే ప్రాజెక్టు పనులు ప్రణాళిక ప్రకారం జరుగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడంపై మండిపడ్డారు. అక్కడే ఉన్న పాజెక్టు గుత్తేదారు, కంపెనీ ప్రతినిధులు, అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదన్ననారు. సకాలంలో పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జాప్యం ఎందుకు ?
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ క్రమంలో పనుల ఆలస్యం సరికాదన్నారు స్మిత సబర్వాల్. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుంటే .. సీతారామలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. వెంటనే పనులు స్పీడప్ పెంచాలని సూచించారు. నిర్దేశిత సమయంలోపు ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని తేల్చిచెప్పారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications