సకాలంలో పనులు చేయకుంటే చర్యలు తప్పవు : సీతారామ ప్రాజెక్టు గుత్తేదారుపై స్మితా ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం : సాగునీటి ప్రాజెక్టుల్లో ఆలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టంచేశారు సీఎంవో ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనుల ఆలస్యంపై ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇవాళ పనుల తీరును ఆమె పరిశీలించారు. అయితే ప్రాజెక్టు పనులు ప్రణాళిక ప్రకారం జరుగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడంపై మండిపడ్డారు. అక్కడే ఉన్న పాజెక్టు గుత్తేదారు, కంపెనీ ప్రతినిధులు, అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదన్ననారు. సకాలంలో పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జాప్యం ఎందుకు ?
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ క్రమంలో పనుల ఆలస్యం సరికాదన్నారు స్మిత సబర్వాల్. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుంటే .. సీతారామలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. వెంటనే పనులు స్పీడప్ పెంచాలని సూచించారు. నిర్దేశిత సమయంలోపు ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని తేల్చిచెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications